Shruti Haasan : రెండు సినిమాలకు చాలా కష్టపడ్డా..

టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ శృతిహాసన్ దూసుకుపోతోంది. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే,
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో “వీర సింహా రెడ్డి“, మెగాస్టార్ చిరంజీవి-బాబి కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య‘ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల అవుతుండగా, జనవరి 13న వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ఈ రెండు సినిమాలపై శృతిహాసన్ ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. ఈ రెండు సినిమాల కథలు, పాత్రలు, ట్రీట్మెంట్ భిన్నంగా ఉంటాయి. తన పాత్రలు డిఫరెంట్ గా, సవాల్ గా ఉంటాయన్నారు. ‘వీర సింహారెడ్డిలో..’ నా పాత్ర కామెడీగా ఉంటుంది. కామెడీ చేయడం కష్టం. అలాగే వాల్తేరు వీరయ్యలో కూడా నా పాత్రను బాగా రాశారు. అంటూ చెప్పుకొచ్చింది.

వీరసింహారెడ్డి లోని సుగుణసుందరి స్టెప్ బాగా రీచ్ అయిందని అన్నారు. అలాగే వాల్తేరు వీరయ్య లోని శ్రీదేవి, చిరంజీవి పాట కూడా అద్భుతంగా వచ్చిందన్నారు. సుగుణసుందరి సాంగ్ కోసం ఎండలో, నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరు పాట కోసం విపరీతమైన చలిలో చేశానన్నారు. “ఇండియన్స్ కి ఎండ సమస్య కాదు. కానీ చలి తట్టుకోవడం కష్టం” పైగా పల్చటి చీరలో మైనస్ 11 డిగ్రీల చలిలో చేయాల్సి వచ్చిందని శృతి చెప్పారు.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు