లోకనాయకుడు కమల్ హాసన్ నట వరుససురాలిగా శృతి హాసన్ సినిమాల్లో హీరోయిన్ గా అరంగ్రేటం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన శృతి హాసన్, తెలుగులో సిద్దార్థ్ హీరోగా నటించిన అనగనగ ఒక ధీరుడు అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆశించినంత విజయం సాధించలేకపోయింది.
కానీ ఈ సినిమా తరువాత శృతి హాసన్ తెలుగు, తమిళ్ భాషల్లో బిజీ హీరోయిన్ ఐపోయింది. రెండు భాషలలో ఉన్న దాదాపు టాప్ స్టార్స్ అందరితో శృతి స్క్రీన్ షేర్ చేసుకుంది.ఆ తరువాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శృతి, అక్కడ కూడా పలు సినిమా చేసింది.కానీ తెలుగు, తమిళ్ తో పోలిస్తే ఆమెకి బాలీవుడ్ లో ఆశించినంత సక్సెస్రాలేదు. దాంతో హిందీ కంటే టాలీవుడ్, కోలీవుడ్ పైనే ఆమె ఫోకస్ చేసింది.
ఇటీవలనే ఆమె చిరంజీవితో వాల్తేర్ వీరయ్య, బాలయ్యతో వీరసింహరెడ్డి సినిమాలలో నటించింది. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ప్రస్తుతం శృతి హాసన్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయిన సలార్ లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నాని30 మరియు ది అయ్ అనే ఇంగ్లీష్ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించనుంది. అయితే ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే శృతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. శృతి ఎవరెవరితోనే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో, ప్రతిరోజు ట్రేండింగ్ లో నిలుస్తుంది. అయితే ఇటీవలనే లండన్ కి వెళ్లిన ఈ స్టార్ బ్యూటీ ఒక వ్యక్తిని క్లోజ్ గా ఫోటో దిగి అతనితో ఉంటే నాకు పగలు, రాత్రి తేడా తెలియట్లేదంటు పోస్ట్ చేయగా, అందరు ఇంతకీ ఎవరతను అని ఆరా తీయడం స్టార్ చేసారు. అయితే ఈమె ఇలా పెట్టడం కొత్తేమి కాదులే అనుకున్నవాళ్ళు సైలెంట్ గా చూసి వదిలేస్తున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News