Shruti Haasan : కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్ర‌స్తుతం ఓ హాలీవుడ్ మూవీ చేస్తుంది. అందుకోసం ఇటీవ‌లే శృతి గ్రీస్ కు కూడా వెళ్లింది. ది ఐస్ అనే సైకలాజికల్ థ్రిల్రర్ చిత్రంలో మెయిన్ లీడ్ లో శృతి హాసన్ కనిపించబోతున్నారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఎమిలీ కార్లటన్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో మార్క్ రౌలీ, శృతి హాసన్ ప్రధాన తారగాణంగా ఉండబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను గ్రీస్ లో జరుపుకుంటుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ వర్క్ షాప్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ లో హీరోయిన్ శృతి హాసన్ పాల్గొంటున్నారు. కాగా హాలీవుడ్ ప్రాజెక్ట్ ది ఐస్ లో తాను నటిస్తున్నానని శృతి హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నేను భాగం కావడం నాకు చాలా స్పెషల్.

ఈ సినిమా చేయడం చాలా ఆసక్తితో ఉన్నాను. అంటూ సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ పోస్ట్ పెట్టింది. ఇది ఇలా ఉండగా, ది ఐస్ అనే చిత్రం 1980 నేపథ్యంలో ఉంటుందని సమాచారం. భర్త మరణం తర్వాత ఒక యువతి అస్తికల కోసం వెళ్తుంది. ఈ క్రమంలో తన భర్త మరణం గురించి తెలుసుకుంటుంది. అతనిది సహజ మరణం కాదని తెలుసుకున్న ఆ యువతి తర్వాత ఏం చేసింది అనేది ది ఐస్ స్టోరీ అని టాక్ వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు