Shruti Haasan: ఆ బట్టలు వేసుకోవడం నరకమే

విలక్షణ నటుడు కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో శృతిహాసన్ క్రేజ్ మామూలుగా లేదు. తెలుగుతోపాటు ఇతర భాషల్లో క్రేజీ ఫీలిమ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుంది. ఈమె సినీ జీవితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం ముందు, తర్వాత అని పేర్కొంటారు సినీ పరిశీలకులు.

శృతిహాసన్ ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటుంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తుంది. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్లో రాబోతున్న మెగా 154 వాల్తేరు వీరయ్య లో, అలాగే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీలో కూడా నటిస్తోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శృతిహాసన్ మాట్లాడుతూ.. ” ఎదుటివారికి నచ్చేలా బతకడం జీవితంలో అత్యంత కష్టమైన పని. అందరికీ నచ్చేలా వస్త్రాధారణ చేసుకోవడం, మాట్లాడడం, ఇవే జీవితంలో అత్యంత కష్టమైన పనులు. మనల్ని ఎదుటి వాళ్ళు ఎలా ఆమోదిస్తున్నారు అనేది మారిపోతూ ఉంటుంది. అదే ప్రమాదకరం. అందుకే మనసుకు నచ్చేలా, సంతోషంగా అనిపించేలా ఉండడం చాలా ముఖ్యం. నేనెప్పుడూ అలాగే ఉంటాను. జీవితంలో ఎప్పుడూ మరొకరికి నీడగా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. అందుకే నేనెప్పుడూ ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను ” అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు