SSMB28 : స్పీడ్ పెంచారు

ఏ ముహూర్తాన SSMB28 ని స్టార్ట్ చేశారో కానీ.. అన్ని అడ్డంకులే. మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలైన సమయంలోనే SSMB28పై వార్తలు వచ్చాయి. కానీ, అప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సినిమా కంటే.. పవర్ స్టార్ సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. పవన్ సినిమా పనులు అయిపోయిన తర్వాత SSMB28 ని ముందేసుకున్నాడు. స్టోరీని సిద్ధం చేశాడు. కానీ అది మహేష్ కు నచ్చలేదు. దీంతో స్క్రిప్ట్ వర్క్ కు మరింత కాలం..

ఎలాగోలా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లాలి అనుకునే సమయంలో మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి మరణించారు. దీంతో చాలా రోజులు మహేష్ బయటకు రాలేదు. ఈ భాద నుంచి బయటపడటానికి విదేశి పర్యటనలకు వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మొదటి షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ప్రారంభంలోనే మహేష్ పై భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తున్న సమయంలో మహేష్ బాబు నాన్న.. సూపర్ స్టార్ కృష్ణ హఠన్మారణం పొందారు. దీంతో మళ్లీ గ్యాప్.

ఇంత జరిగాక.. త్రివిక్రమ్ చెప్పిన స్టోరీని మహేష్ రిజక్ట్ చేశారు. అయితే మాటల మాంత్రికుడి దగ్గర మరో స్టోరీ ఉండటంతో దానితో SSMB28ని కానిస్తున్నారు. దీంతో మొదటి షెడ్యూల్ లో చేసిన షూటింగ్ మొత్తం ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్రెష్ స్టోరీతో ఫ్రెష్ గా సినిమాను స్టార్ట్ చేయాలని చేస్తున్నారు. మహేష్ ఇప్పటికే కెమెరా ముందుకు వచ్చాడు. దీంతో SSMB28 షూటింగ్ డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కాబోతుందని తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

- Advertisement -

దీందో మేకర్స్ సర్వం సిద్ధం చేస్తున్నారు. నగర శివారులో మూడు భారీ సెట్స్ ను నిర్మిస్తున్నారట. అందులో ఒకటి శ్యామ్ సింగరాయ్ కి వేసిన సెట్ స్థానంలో వేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మొదటి షెడ్యూల్ ఈ సెట్స్ లోనే ఉంటుందని తెలుస్తుంది. దీంతో మరో రెండు సెట్స్ ను కూడా త్వరగా పూర్తి చేస్తున్నారట. మూడు సెట్స్ లలో SSMB28 షూటింగ్ డిసెంబర్ 16 నుంచి నాన్ స్టాప్ గా జరగనుందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు