SSMB28:మహేష్ తో జోడీ కడుతున్న తమన్నా ?

సర్కారు వారి పాట కమర్షియల్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా చిత్రం SSMB28 (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. SSMB28 షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ, స్క్రిప్ట్ విషయంలో ఆలస్యం, మహేష్ బాబు తల్లి దండ్రులు ఇందిరా దేవి , సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయింది.

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇది ఇలా ఉండగా, తాజాగా మహేష్ బాబుకు జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా జతకడుతుంది. అదేంటి.. SSMB28 లో హీరోయిన్స్ గా పూజా హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్ ఉన్నారు కాదా.. మళ్లీ తమన్నా ఎందుకు ? అని డౌట్ వచ్చిందా ? అసలు విషయం ఏంటంటే.. మిల్క్ బ్యూటీ తమన్నాతో సూపర్ స్టార్ మహేష్ నటిస్తుంది సినిమాలో కాదు. ఒక యాడ్ షూట్ లో.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 షూటింగ్ జరుగుతున్నా.. మధ్యలో మూడు రోజులు సమయాన్ని ఈ యాడ్ కు కేటాయించారట. ఆ యాడ్ లో మహేష్, తమన్నా కలిసి నటిస్తున్నారు. ఈ యాడ్ దేని కోసం అనేది మాత్రం బయటకు రాలేదు. కానీ, దీని కోసం సూపర్ స్టార్ భారీ మొత్తంలో రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని టాక్. మహేష్ సినిమాలతో పాటు ఎక్కువగా యాడ్స్ కూడా చేస్తుంటాడు. ఇప్పటికే చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాడు. అలా యాడ్స్ తో వచ్చిన డబ్బులతో తాను చేసే సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తాడు.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు