Sudeep: మనకు ఒక క్లారిటీ ఉండాలి

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిరాక్ పార్టీతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ, తెలుగు తెరపైకి ఛలో సినిమాతో వచ్చింది. తర్వాత విజయ్ దేవరకొండతో వచ్చిన గీత గోవిందంతో మంచి హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. దీని తర్వాత తెలుగుతో పాటు అన్ని భాషల్లో అవకాశాలు దక్కించుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

కానీ కొన్ని రోజుల నుంచి ఈ సక్సెస్ ఫుల్ హీరోయిన్ పై అనేక రకమైన ట్రోల్స్ వస్తున్నాయి. ముందుగా హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమాపై రష్మిక చేసిన వ్యాఖ్యలతో కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వెళ్లి, స్టార్ ఇమేజ్ తెచ్చుకుని, ఇప్పుడు కన్నడ సినిమాలను, ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదని, చాలా పొగరు వచ్చిందంటూ విమర్శలు వచ్చాయి. అదే విధంగా విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో లవ్ ట్రాక్ నడిపిస్తోంది అంటూ కూడా ట్రోల్స్ వస్తున్నాయి. అలాగే రష్మిక ఇటీవల ఒక బాలీవుడ్ సినిమా ప్రమోషన్ లలో భాగంగా సౌత్ ఇండస్ట్రీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈమెపై మరిన్ని ట్రోల్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్.. రష్మిక మందన్నా పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించాడు. “15-20 ఏళ్ల క్రితం మమ్మల్ని కేవలం న్యూస్ ఛానెల్స్, పేపర్లు మాత్రమే ఇంటర్వ్యూలు చేసేవి. ఆ సమయంలో అవి తప్ప మరేవి కూడా లేవు. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఉంది. దీని వల్ల చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఫేక్ న్యూస్ ను ఎదుర్కొవడం నేర్చుకోవాలి. అలా చేసినప్పుడే మనం ముందుకు సాగుతుంది” అని అన్నారు.

- Advertisement -

అలాగే “సెలబ్రెటీలపై ప్రజలు పూలదండలు వేస్తారు అలాగే రాళ్లు, గుడ్లు, టమోటాలు కూడా వేస్తారు. వాటిని ఎదుర్కొని మరింత బలంగా మారాలి. మనం ఏం మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడతాము.. ఏమి చెప్పాలి అనే విషయాలలో ముందుగా మనకు ఒక క్లారిటీ ఉండాలి” అంటూ కిచ్చ సుదీప్ ట్రోల్స్ పై వ్యాఖ్యలు చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు