Pawan Kalyan : ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిన పవన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇంకా మూడు సినిమాలు రూపొందాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ ఉంది. హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయాల్సి ఉంది. సముథ్ర ఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతం’ రీమేక్ కూడా లైన్ లో ఉంది. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ ఇంకా కొంతమంది నిర్మాతల వద్ద అడ్వాన్స్ లు తీసుకున్నారట. వారిలో ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య ఒకరని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు ఏడాదిన్నర క్రితమే 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారట. దీంతో పవన్ సినిమా కోసం దానయ్య ఆశగా ఎదురుచూస్తున్నారు దానయ్య.

ఈ సినిమ సాహో దర్శకుడు సుజీత్ తో ప్లాన్ చేశారట. ‘తేరి’ రీమేక్ చేయడానికి సన్నాహాలు కూడా చేశారట. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ‘తేరి’ రీమేక్ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేశాడని వినికిడి. పవన్ కు దర్శకుడు త్రివిక్రమ్ రిఫర్ చేసిన ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ తప్పక ఉంటుందని అనుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్య ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. దానయ్య తో సినిమా చేస్తారట. కానీ, కానీ సుజీత్ తో ‘తేరి’ రీమేక్ వద్దని పవన్ స్పష్టం చేశారని తెలుస్తుంది. అందుకేనేమో, సుజీత్ తన తర్వాత సినిమాను వరుణ్ తేజ్ తో ఖరారు చేసుకున్నాడు అంటూ ఇప్పుడు వార్తలు మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు