Swetha Basu Prasad : ఏ పాత్రనైనా చేస్తా

ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు శ్వేత బసు ప్రసాద్ అంటే పెద్దగా పరిచయం ఉండదు. కానీ 2008లో ఎక్కడా…. అనే రొమాంటిక్ పిలుపుతో కుర్రకారు గుండెలను దోచుకుంది. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన కొత్త బంగారు లోకం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బిహార్ భామ. దీనికి ముందు ఈమె హిందీ భాషలో సినిమాలు చేసింది. కొత్త బంగారు లోకం హిట్ తర్వాత తెలుగులో ఛాన్స్ లు దక్కించుకుంది. కానీ 2014 లో ఒక ఘటన తర్వాత ఇండస్ట్రీ దూరంగా ఉంటూ వచ్చింది.

సుధీర్ఘ విరామం తర్వాత శ్వేత బసు మళ్లీ 2017 లో బద్రీనాథ్ కీ దుల్హనియా అనే హిందీ సినిమాతో సిల్వర్ స్క్రిన్ పై కనిపించింది. తర్వాత ప్రతి సంవత్సరం సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం థియేట్రికల్ సినిమాల కంటే, ఓటీటీలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈమె ఇటీవల నటించిన ఇండియన్ లాక్ డౌన్ అనే చిత్రం ఓటీటీలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్వేత బసు సెక్స్ వర్కర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే

దీనిపై శ్వేత బసు తాజా గా స్పందించింది. తాను సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా సిద్ధంగా ఉంటానని చెప్పింది. దానిలో ఏ సందర్భంలో కూడా సిగ్గుపడనని చెప్పుకొచ్చింది. ఒక వేళ టెర్రరిస్ట్ పాత్ర చేయాల్సి వచ్చినా, దానికి కూడా రెడీగా ఉంటానని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు