Chiranjeevi : రామ్ చరణ్ వల్లే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఇది అధికారిక రీమేక్. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్ లాంటి స్టార్ నటీ నటులు ఈ సినిమాలో ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ రోజు అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

భారీ వర్షం వస్తున్నా.. వందల మంది అభిమానుల మధ్య మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మాట్లాడారు. ముందుగా.. “ఒక సెంటిమెంట్.. నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా.. ఈ నెల తడుస్తుంది. పొలిటికల్ క్యాంపెన్ కు పులివెందులకు వచ్చినప్పుడు వర్షం పడింది. ఇంద్ర సినిమాలో ఒ సాంగ్ చేస్తున్నప్పుడు వచ్చింది. మళ్లీ ఇప్పుడు కూడా వర్షం వచ్చింది. ఇవన్నీ నాకు భగవంతుడు ఇచ్చే ఆశీస్సులుగా భావిస్తున్నాను” అని అన్నారు. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇంద్ర దేవీకి నివాళ్లు అర్పించారు. కృష్ణ, మహేష్ బాబు కుటుంబానికి సానుభూతి తెలిపారు.

దీని తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. “లూసిఫర్ మూవీ నేను చూశాను. చాలా బాగుంది. ఈ లూసిఫర్ మూవీ గాడ్ ఫాదర్ గా మారడానికి ప్రధాన కారణం రామ్ చరణ్. ఈ సినిమా చేయాలని నన్ను చరణ్ కోరాడు. నాకు బాగా సెట్ అవుతుందని చెప్పాడు. మోహన్ రాజా పేరును కూడా రామ్ చరణ్ నే సూచించాడు. అందరూ గర్వ పడేలా మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించాడు. అలాగే సల్మాన్ ఖాన్ ను ఈ సినిమాలో నటించేలా చేసింది రామ్ చరణ్. అలాగే తనతో పాటు మరో పెద్ద నిర్మాణ సంస్థ ఉంటే బాగుంటుందని సూపర్ గుడ్ ఫిలంతో కలిసాం. ఇద్దురు కలిసి ఈ సినిమా అద్భుతంగా నిర్మించారు” అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అలాగే నయనతార, సత్యదేవ్ పాత్రల గురించి కొన్ని విషయాలను చెప్పాడు. “సత్య దేవ్ పాత్ర నన్ను ఎదురొడ్డి నిలిచేది. ఈ పాత్రకు సత్యదేవ్ న్యాయం చేశాడు. ఇది సినిమా రిలీజ్ తర్వాత మీరే చెబుతారు” అంటూ వివరించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు