Theri: హరీష్ శంకర్‌‌కి ఫ్యాన్ సుసైడ్ లేటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ రీమేక్ సినిమాలకు స్పెషలిస్ట్. ప్రస్తుతం పవన్ తో హరీష్ రీమేక్ సినిమానే చేస్తున్నాడట. తమిళంలో సూపర్ హిట్ అయిన తేరి ని రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. రీమేక్ ఆలోచన మానుకోవాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌గా మార్చారు.

ఈ క్రమంలో ఓ అభిమాని.. దర్శకుడు హరీష్ శంకర్‌, మైత్రీ మూవీ మేకర్స్‌కి ఒక లేఖ రాసింది. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లేఖలో.. ‘‘సర్, ఇంత వరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ లెటర్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు ఎన్ని రీమేక్స్ తీసినా ఎప్పుడూ ఇంత ఫీలవ్వలేదు. కానీ తేరి రీమేక్ అని తెలిశాక రాయక తప్పలేదు. కనీసం నా చావుని చూసైనా తేరి రీమేక్‌ని క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పటికే ప్రతి ఆదివారం టైమింగ్స్ మార్చి టీవీల్లో తేరి మూవీని వేస్తున్నారు. ప్లీజ్ సార్.. ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేయండి. నా చావుకి కారణం మైత్రీ మూవీ మేకర్స్ , డైరెక్టర్ హరీష్ శంకర్. చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోకండి ’ అని రాసి ఉంది.

ఈ లెటర్ కూడా ట్రెండ్ అవుతుందో. అనేక ట్వీట్స్ వస్తున్నాయి. ఈ సుసైడ్ లెటర్‌పై పవర్ స్టార్ వీరాభిమారి, నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. ‘‘బ్రదర్ ప్లీజ్ వెయిట్.. ఇలాంటి లెటర్స్ రాయొద్దు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. మన పవన్ కళ్యాణ్‌ సార్‌తో ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ సినిమా తీస్తా’’ రిప్లే ఇచ్చాడు. అయినా #WeDontWantTheriRemake , సుసైడ్ లెటర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి, మరి ఇంతలా వస్తున్న వ్యతిరేకతను చూసి తేరి రీమేక్ ను నిలిపిస్తారా లేదో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు