తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే దాదాపు 20 ఏళ్ళు అవుతున్న ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరియర్ లో ముందు దూసుకుపోతోంది త్రిష. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన త్రిష మరోసారి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంటుంది.
దాదాపు 2016 నుంచి అవకాశాలు లేకుండా ఉంటున్న త్రిష మళ్లీ ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చింది. 1999 నుంచి త్రిష సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 70 చిత్రాలలో నటించింది ఈ భామ. పొన్నియన్ సెల్వన్ తర్వాత రాంజీ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలతో అదరగొట్టింది.ప్రస్తుతం విజయ్ తలపతితో ఓ సినిమా, అజిత్ తో ఓ చిత్రంలో నటించే అవకాశాలను కొట్టేసింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష కీలక వ్యాఖ్యలు చేసింది. ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో త్రిష కి మీకు ఏ ఫుడ్ అన్న ప్రశ్న ఎదురయింది. దీనికి త్రిష సమాధానమిస్తూ.. ” నాకు సౌత్ ఇండియన్ హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ బ్రాహ్మణుల ఇంటి భోజనం అంటే ఇంకా చాలా ఇష్టం” అని చెప్పింది త్రిష. అలా ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజెన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఎటువంటి ఫుడ్ ఇష్టం అన్న ప్రశ్నకు మధ్యలో కులాన్ని తీసుకురావడం ఏమిటి? అని కొందరు నెటిజెన్లు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం తనకు అనిపించింది చెప్పడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.
For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.