Tollywood : మర్యాదపూర్వకంగా..

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం ఘట్టమనేని కుటుంబ సభ్యుల్లో, అభిమానులలో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 4 గంటలకు ఆమె ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఆమె మరణ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలో పడేసింది.

పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఇందిరా దేవికి నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సాంప్రదాయ పద్ధతిలో తల్లి మృతదేహానికి మహేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. నిట్రో స్టార్ సుధీర్ బాబు తన అత్తగారు మరణించడంతో తన సినిమా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ “హంట్”.

భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28 ఉదయం 11:33 గంటలకు ఈ మూవీ టీజర్ విడుదల చేయడానికి ఏర్పాటు చేశారు. అయితే చివరి నిమిషంలో ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. అలాగే అల్లరి నరేష్ ” ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” చిత్రం నుండి బుధవారం అప్డేట్ ప్రకటించాల్సి ఉంది. కానీ ఇందిరా దేవి గారి మరణంతో ఈ అప్డేట్ ని వాయిదా వేసి శుక్రవారం విడుదల చేశారు. దీంతో చాలామంది నటీనటులు ఈ టీమ్ లు తీసుకున్న చర్యలను అభినందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు