Urvasi rautela:ఒక సాంగ్ కి అంత డిమాండ్ ఆ?

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” ఇటీవల సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.చాలా కాలం తర్వాత చిరంజీవి ఈ చిత్రంలో ఫుల్ మాస్ లుక్ లో కనిపించారు.

చిరంజీవితో పాటు ఈ చిత్రంలో శృతిహాసన్,మాస్ మహారాజా రవితేజ, కేథరిన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.అయితే ఈ చిత్రంలో ఐదు పాటలు ఉండగా ఆడియన్స్ ని బాగా మెప్పించిన సాంగ్ మాత్రం “బాస్ పార్టీ”.ఈ సాంగ్ లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.పక్కా మాస్ గెటప్ లో చిరంజీవి ” “క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే”.. అంటూ డాన్స్ చేస్తూ కనిపించారు.

ఇక ఊర్వశి ” “బాసు.. వేరీజ్ ద పార్టీ” అంటూ చిందేస్తూ కనువిందు చేసింది. దేవిశ్రీ మ్యూజిక్, శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఈ పాటని వేరే లెవెల్ కి తీసుకువెళ్లాయి. డీఎస్పీ తో పాటు ఆకాష్ అజీజ్, హరిప్రియ ఈ పాటలో గొంతు కలిపారు. ఈ పాట చిత్రీకరణ కోసం దాదాపు 30 కోట్ల వరకు చిత్ర యూనిట్ ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.

- Advertisement -

అయితే ఈ పాట కోసం ఊర్వశి తీసుకున్న పారితోషికంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. మూడు నిమిషాల ఈ పాట కోసం ఊర్వశి రౌటేలా దాదాపు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ రూ. 1.5 కోట్లు తీసుకోగా.. ఊర్వశి పారితోషికం పై నేటిజెన్లు తెగ చర్చించుకుంటున్నారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు