అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ చిత్రానికి విజేత సినిమా ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహించారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ-2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఊర్వశివో రాక్షసివో’ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్, ట్రైలర్ మంచి అంచనాలను నెలకొల్పాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ చిత్రానికి U/A సర్టిపికెట్ లభించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరించనుంది.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన జీఏ-2 పిక్చర్స్ లో ఈ ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రానికి అచ్చురాజమని సంగీతం అందించారు. అనూప్ రూబెన్స్ కూడా ఒక పాటను సమకూర్చారు. ఈ చిత్రం నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.