SVP : జగన్ డైలాగ్ వాడుకుని… జగన్ ప్రభుత్వం పైనే సెటైర్లు..!

నేను ఉన్నాను .. నేను విన్నాను..! ఇది జగన్ పాదయాత్ర టైంలో చెప్పిన డైలాగ్. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూడా ఓ సందర్భంలో చెప్పారు అని అంటారు. కానీ యాత్ర సినిమాలో తప్ప ఆ డైలాగ్ ఎక్కడా విన్నట్టు జనాలకి గుర్తులేదు. అయితే యాత్ర సినిమాలో కంటే సర్కారు వారి పాట.. ట్రైలర్ ద్వారా ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఈ డైలాగ్ వల్ల జగన్ ప్రభుత్వం… సర్కారు వారి పాటకి ఏపి లో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది, 5 వ షోకి అనుమతి కూడా ఇచ్చింది అని అంతా నమ్ముతున్నారు. అయితే 5 వ షోకి అనుమతి ఇచ్చిన సంగతి ఎవ్వరికీ తెలీదు లెండి అది వేరే విషయం. ఇక అసలు విషయానికి వద్దాం.

సర్కారు వారి పాట లో జగన్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో.. ఈ సినిమాలో జగన్ ప్రభుత్వం పై పంచ్ లు కూడా ఉన్నాయి అనేది సినిమా చూసిన జనాల అభిప్రాయం.కొన్ని లక్షల కోట్లు కొట్టేసి జనాల దగ్గర రూ.50, రూ.100 అదనంగా ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు అంటూ వసూల్ చేస్తుండడం… మీకు నచ్చినట్లు రూల్స్ మార్చుకుంటారు .. మిమ్మల్ని ఎవరు నిలదీస్తారు అనే డైలాగులు ఆ ప్రభుత్వం పై సెటైర్స్ అన్నట్టే ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు