Varisu : సర్ప్రైజెస్ తో వారిసు ఆడీయో లాంచ్

విజయ్ తలపతి నటించిన చిత్రం ‘వారిసు’ సంక్రాతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో సందడి చేయనుంది. తలపతి కి జోడిగా రష్మికా మందన్నా నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే థమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. తమిళం తోపాటు తెలుగు, హిందీ లో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు ‘వారిసు’ ఆడియో లాంచ్ పై కొని వార్తలొస్తున్నాయి. డిసెంబర్ 24న చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో ఆడియో లాంచ్ జరగనుందని సన్నిహిత వర్గాల సమాచారం. ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్ ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ నీ భారి గా ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది. సన్ టీవీలోనే లైవ్ స్ట్రీమ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా పుకారు చాలా రోజుల నుంచి ఉంది.

తాజాగా శనివారం చెన్నైలో గ్రాండ్ గా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు ఉంటాయని చెప్పుకొస్తున్నాయి సినీ వర్గాలు. దీంతో ఈ ఈవెంట్ పై తలపతి ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

కానీ వీరికి సన్ పిక్చర్స్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆడియో లంచ్ ఈవెంట్ ను శనివారం టీవీలో ప్రత్యక్ష ప్రసారం చెయ్యట్లేదు అనే వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై ఫ్యాన్స్ అసంతృప్తి చెందుతున్నారు. ఈవెంట్ జనవరి 1, 2023న కొత్త సంవత్సరం రోజు స్పెషల్‌గా సన్ టీవీలో ప్రసారం చేయబడుతుంది. అయితే లైవ్ స్ట్రీమ్ పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రటకన రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు