Veera Simha Reddy: సంక్రాంతి బరిలో బాలయ్య

నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. డాన్ శీను, బాడీగార్డ్, బలుపు అలానే ఇటీవల సంచలన విజయం సాధించిన క్రాక్ వంటి సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 70 కోట్ల బడ్జెట్ తో వీరసింహారెడ్డిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రాబోతుంది. దీనిలో దాదాపు 11 ఫైట్స్ ఉంటాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే సాయి మాధవ్ బుర్ర అందించిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయని సమాచారం. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. ముందు నుంచి ఈ తేదీకి సినిమా వస్తుందనేది తెలిసిందే. కాకపోతే ఈరోజు అధికారికంగా వెల్లడించారు. సంక్రాంతి బరిలో తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న ‘వారసుడు’ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆరోజు తెలుగు రాష్ట్రంలో థియేటర్లను విజయ్, బాలకృష్ణ పంచుకోవాలి. వీళ్ళిద్దరూ వచ్చిన మరుసటి రోజు, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’తో మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలోకి రానున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు