Veera Simha Reddy: మాస్ ఎలివేషన్

నందమూరి బాలయ్య హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. క్రాక్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న వీర సింహారెడ్డి సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఈనెల 12న భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. దీనికోసం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు.

ఇక తాజాగాఈ సినిమా ట్రైలర్ ను వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. బాలయ్య ఊరమాస్ లుక్ గూస్ బమ్స్ తెప్పిస్తున్నాయి.
“సీమలో ఏ ఒక్కడు కట్టిపడకూడదని, నే నోక్కడినే కత్తి పట్టా, పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు, ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్, వీరసింహారెడ్డి, పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్” అంటూ బాలయ్య బేస్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యాంతం అదిరిపోయింది.

బాలయ్య మాస్ పంచులు, యాక్షన్ సీక్వెన్స్ అయితే దుమ్ము రేపడం ఖాయం. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్స్ గా కనిపించారు. బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన యాక్షన్ లో మాత్రం ఇద్దరు అదరగొట్టేశారు. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీర లెవెల్ లో ఉంది. నిజం చెప్పాలంటే బాలయ్య ట్రైలర్ తోనే హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా ను ఓ రేంజ్ కు తీసుకుపోయింది ట్రైలర్.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు