Venuswamy: డిమాండ్ మాములుగా లేదుగా.. విలన్ లు కూడా ..!

Venuswamy.. రెండు రాష్ట్రాల ప్రజలకు వేణు స్వామి అంటే తెలియని వారంటూ ఉండదు.. ముఖ్యంగా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలను తెలియజేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరో , హీరోయిన్లు, బుల్లితెర సెలబ్రిటీలకు పూజలు చేస్తూ ఉంటారు.. అప్పుడప్పుడు వేణు స్వామి చేసే పనుల వల్ల ట్రోలింగ్ కు కూడా గురవుతూ ఉంటారు. ఇలా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామితో ప్రత్యేకంగా పూజలు చేయిస్తూ ఉంటారు. అలా ఇప్పటికే స్టార్స్ సైతం వేణు స్వామితో పూజలు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిలో ప్రముఖ నటుడు డైరెక్టర్ సముద్రఖని కూడా చేరిపోయారు.

Venuswamy: The demand is not normal.. even the villains..!
Venuswamy: The demand is not normal.. even the villains..!

వేణు స్వామి డిమాండ్ మాములుగా లేదుగా..

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వేణు స్వామి తెలియజేయడం జరిగింది. ప్రముఖ కామాఖ్య దేవాలయంలో వేణు స్వామి చేతుల మీదుగా ప్రత్యేకమైన పూజలు చేయించాలంటే సముద్రఖని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ పూజలో భాగంగా ప్రసాదం గా చేపల కూర, మటన్ కూరను తీసుకురావడం జరిగిందట. అలాగే దర్శకులు నటులతో కలిసి ఈ పూజా కార్యక్రమాలను చాలా గ్రాండ్గా జరుపుకున్నామంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. వీటిని చూసిన పలు రకాల నెటిజన్స్ కూడా విభిన్నంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

ప్రసాదంగా చేపల పులుసు , మటన్ కూర..

ముఖ్యంగా చేపల కూర, మటన్ కూర ప్రసాదం అని చెప్పడంతో చాలామంది ఈ విషయాన్ని అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం పైన కూడా వీడియోలో వేణు స్వామి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. ఈ వీడియోలో కనిపిస్తున్న కామాఖ్య దేవాలయంలో మానసా దేవి పూజ చేశామని వారాహి నవరాత్రిలో భాగంగానే..16,17,18,19 ఈ నాలుగు రోజులు చాలా ప్రత్యేకమైన రోజులని కూడా తెలియజేశారు.. మానసా దేవి పూజా కార్యక్రమం కాబట్టే ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తారని రెగ్యులర్గా మటన్ కూరని కూడా నైవేద్యంగా వండుతూ ఉంటారని తెలియజేశారు.

- Advertisement -

వేణు స్వామి తో సముద్రఖని ప్రత్యేక పూజలు..

ముఖ్యంగా ఈ దేవాలయంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా మటన్ కూర పెడతారని ఇది దొరకడం చాలా భోగమని కూడా తెలియజేశారు వేణు స్వామి. ఇది దొరకడం చాలా కష్టమని అలాంటిది అమ్మవారి దయవల్ల సముద్రఖని గారి వల్లే ఈ భాగ్యం తనకు లభించింది అంటూ తెలియజేశారు.. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి. ఇక సముద్రఖని ఒకవైపు డైరెక్టర్గా మరొకవైపు నటన రంగంలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు.. కొన్ని చిత్రాలలో విలన్ గా ఉన్నప్పటికీ మరికొన్ని చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో కూడా సముద్రఖని మరింత ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే నువ్వేనా స్వామి డిమాండ్ బాగా పెరిగిపోయిందని, అందుకే హీరోయిన్లే కాదు విలన్ గా నటిస్తున్న వారు కూడా వేణు స్వామి తో పూజలు చేయించుకుంటూ అందరిని ఆశ్చర్యపరచుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు