Vikram : కేజీఎఫ్‌

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన ” కేజిఎఫ్” రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో కేజిఎఫ్ మూడో భాగం కూడా ఉంటుందనే వార్తలు వెలువడ్డాయి. బాహుబలి సిరీస్ తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధికంగా పైసా వసూల్ చేసిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

ఇదిలా ఉంటే కేజీఎఫ్ కాన్సెప్ట్ తో సౌత్ ఇండియాలో మరో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ చిత్రం 18 వ శతాబ్దం బ్యాగ్ డ్రాప్ లో ఉండనుందట. అంతేకాదు.. ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో తీయనుండడం విశేషం. నిజమైన కేజీఎఫ్ గనులలో.. భారత స్వాతంత్రానికి ముందు జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం.

కేజిఎఫ్ గనులలో ఇండియన్స్ పడిన కష్టాలను చూపించనున్నారట. స్టూడియో గ్రీన్ బ్యానర్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరికెక్కిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించనున్నారని సమాచారం. మరి కేజీఎఫ్ సినిమాతో యష్ ఎలాంటి రికార్డులు సృష్టించాడో.. అదేవిధంగా చియాన్ విక్రమ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు