కిరణ్ అబ్బవరం.. ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రాజావారు రాణిగారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 2019లో వచ్చిన సినిమా అడపదడపగా ఆడింది. ఈ హీరో నటించిన సినిమాలన్ని కూడా యావరేజ్ టాక్ తోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్ని వాసు నిర్మాతగా కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశీ జంటగా నటిస్తున్న చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ”.
ఈ చిత్రంతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకుంది. ఇక టీజర్లో అయితే కిరణ్ మాస్ లుక్లో అదరగొట్టాడనే చెప్పాలి. చివరగా కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం అభిమానులను మెప్పించడంలో విఫలమైందనే చెప్పాలి. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ రిలీజ్ చేశారు.
అక్టోబర్ 29 సాయంత్రం 5.02 గంటలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఓ ప్రోమోను కూడా విడుదల చేయడం విశేషం. ఈ సినిమాకి బన్ని వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందోనని పలువురు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రేపటితో ఈ చిత్రం విడుదల ఎప్పుడో అనే క్లారిటీ అయితే రానుంది.