విరాటపర్వనికి విముక్తి

దగ్గుపాటి రానా , సాయి పల్లవి హీరో హీరోయిన్లగా నటించిన సినిమా విరాట పర్వం. ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా మెల్లమెల్లగా లేట్ అవుతూ వచ్చింది. లక్డౌన్ టైములో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుంది అనే వార్తలు కూడా వచ్చాయి.
ఎప్పటినుంచో రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్ని ఒకేసారి రిలీజ్ అయినా, ఈ సినిమా నుంచి ఇంకా అప్డేట్ రావట్లేదు అనుకుంటున్నా తరుణంలో ఈ మూవీ టీం క్రేజి అప్డేట్ ఇచ్చింది.

ఈ సినిమా నక్సల్ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోయిందని, అందుకే మూవీ యూనిట్ కూడా ఈ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టలేదు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అందరి ఊహలను తారుమారు చేస్తూ, విరాటపర్వం ఎట్టకేలకు ముందుకు కదిలింది.

వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమా 1990 కాలంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించినట్లు అప్పట్లో ఈ మూవీ టీం చెప్పుకొచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ,ట్రైలర్ ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు