టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ అంటే తెలియని వారుండరు. తొలుత వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది అనే రెండు సినిమాలు తీశాడు. మూడవ సినిమా ఫలక్నుమా దాస్ . ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది. ఫలక్నుమా దాస్ సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక అప్పటి నుంచి అభిమానులను పెంచుకున్నాడు. యాక్టింగ్ లో ఎక్కడా తగ్గకుండా కుమ్మేశాడు విశ్వక్. ఇటీవల ” అశోక వనంలో అర్జున కళ్యాణం” వంటి వినోదాత్మక చిత్రంతో వచ్చి మంచి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం ” ఓరి దేవుడా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్. తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్ ని తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.
విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించింది. లియాన్ జేమ్స్ సంగీతం అందించగా.. పీవీపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరుసగా అప్డేట్లను ప్రకటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ” చిన్నప్పటినుంచి స్నేహితులుగా ఉన్న హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు. పెళ్లయిన తర్వాత అపార్ధాల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని కోర్టుకి వెళతారు.
అయితే వీరు వీడిపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు వీళ్ళ సమస్యను ఎలా పరిష్కరించాడు?” తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. “జీవితాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు.. కానీ దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం సాధ్యమవుతుంది” అనే వాయిస్ ఓవర్ ను బట్టి చూస్తే సినిమా ఆసక్తికరంగానే ఉండేటట్లు తెలుస్తోంది . ఇక ట్రైలర్ చివరలో “వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండ్ వైఫ్ లా వచ్చిందనుకో” అంటూ వెంకటేష్ కు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనిపిస్తుంది.