Chiranjeevi: నెక్ట్స్ ఏంటి ?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ కు పెద్దన్న పాత్ర పోషిస్తూ.. తన కాంపౌండ్ నుంచి వరుసగా హీరోయిన్స్ ను అందిస్తూ చిత్ర సీమపై తనదైన ముద్ర వేశాడు. టాలీవుడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ఫస్ట.. మెగాస్టార్ నుంచే ప్రారంభించాలి. తర్వాత పేజీల్లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల పేర్లు కూడా ఉంటాయి. దీనికి కారణం.. మెగాస్టార్ అనే చెప్పొచ్చు. 67 ఏళ్ల వయసు వచ్చినా, యంగ్ హీరోలకు సమానమైన పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి.

మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు చేతిలో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఉన్నాయి. వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని తర్వాత భోళా శంకర్ ను పూర్తి చేసే పనిలో ఉంటాడు. అయితే దీనికి ముందు చిరంజీవి మరి కొన్ని సినిమాలకు సైన్ చేయబోతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి ఇప్పటికే చాలా మంది దర్శకులతో కథలను విన్నారు. అందులో మాస్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఉన్నాడు. అలాగే కేజీఎఫ్ తో సినీ ప్రపంచంలో సెన్సెషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరితో మెగాస్టార్ ఇప్పటికే స్టోరీకి సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే తన తర్వాత సినిమాను ఈ ఇద్దరిలో ఎవరికి ఇస్తాడు అనే ఉత్కంఠ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లో నెలకొంది.

- Advertisement -

పూరీతో చిరు 150వ సినిమా చేయాల్సింది. ఆటో జానీ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ అది పట్టాలెక్కలేదు. కానీ పూరీ సినిమా మాత్రం పక్కా అని చిరు చాలా సందర్బాల్లో చెప్పాడు. అది ఇప్పుడు వస్తుందని టాక్. చిరు కోసం పూరీ.. బలమైన రైటర్స్ తో ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నాడట. అది ఫైనల్ అయితే భోళా శంకర్ తర్వాత వచ్చేది పూరీ సినిమానే.

ఒక వేళ పూరీ స్టోరీలో చిరు మార్పులు కోరితే.. ప్రశాంత్ నీల్ ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే ప్రస్తుతం చిరంజీవి ఫామ్ చేస్తుంటే.. ఈ ఇద్దరు దర్శకులను పక్కన పెట్టి వేరే దర్శకుడితో సినిమా చేసినా.. చెప్పలేం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు