Yash : కేజీఎఫ్ ను మించి..

కేజీఎఫ్ సినిమాతో రాకీ భాయ్ గా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో రాకింగ్ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ రెండు పార్ట్ లు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లను తెచ్చిపెట్టింది. అయితే కేజీఎఫ్ సినిమా తర్వాత యశ్ తన తర్వాత ప్రాజెక్ట్ కోసం జాగ్రత్తగా ఉంటున్నాడు. వచ్చే సినిమా కూడా కేజీఎఫ్ స్థాయిలోనే ఉండాలని చూస్తున్నాడు. అందుకే ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ రాలేదు.

అయితే యశ్ కోసం బాలీవుడ్ నుంచి రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి.. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ‘కర్ణ’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుల్లో ‘కర్ణ’ పాత్ర కోసం యశ్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇటీవల ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ బ్రహ్మాస్త్ర-2 ను తెరకెక్కించబోతున్నారు.

బ్రహ్మాస్త్ర-2 లో దేవ్ పాత్రను యశ్ చేస్తే బాగుంటుందని మూవీ యూనిట్ భావిస్తున్నారట. అందుకోసం చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నటించేందుకు యశ్ సిద్ధంగా లేడని కూడా టాక్ వినిపిస్తుంది. కానీ, కరణ్ జోహర్ మాత్రం యశ్ తో మరోసారి సంప్రదింపులు జరపాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు ప్రాజెక్ట్ లను యశ్ ఫిక్స్ చేసుకుంటే, రాకీ భాయ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశముంది. ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు