Ye Maaya Chesave: జెస్సి స్థానం లో నేషనల్ క్రష్.

ఏమాయ చేసావే సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఊహకు అందని కలెక్షన్లు సాధించి నాగచైతన్యకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. సమంత చేసిన తొలి తెలుగు చిత్రం ఇదే. ఈ సినిమాతో నాగచైతన్యకు ఎంత క్రేజ్ వచ్చిందో, సమంతకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆన్ స్క్రీన్ పై వీళ్ళ జోడికి ప్రేక్షకులు వంద మార్కులు వేశారు.

దాంతో రీల్ లైఫ్ ప్రేమికులు కాస్త రియల్ లైఫ్ ప్రేమికులు అయ్యారు. షూటింగ్ సమయంలోనే ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్న చైసామ్ కొన్ని రోజుల డేటింగ్ తర్వాత ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, గతేడాది ఈ అందమైన జంట విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఏమాయ చేసావే 2’ తెరపైకి వచ్చింది. అంతేకాదు, మరి ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పైనే చర్చ జరుగుతోంది.

అయితే చైతు, సామ్ పెళ్లి అయ్యి విడిపోయాక ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ దాదాపు లేనట్టే. అందుకే సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని ‘ఏ మాయ చేసావే 2’ లో తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ‘ఏ మాయ చేసావే’ సినిమాలో సమంత ప్లేస్ లో కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో వరుస క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్తున్న రష్మిక ఇప్పుడు సూపర్ హిట్ సీక్వెల్ లో కూడా సమంత ప్లేస్ దక్కించుకోవడం క్రేజీగా మారింది.

- Advertisement -

రష్మిక కెరీర్ కి ఈ సినిమా మరింత బూస్టింగ్ ఇచ్చేలా ఉంది. ‘ఏ మాయ చేసావే 2’ సినిమా తెలుగులో పాటుగా తమిళంలో కూడా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ‘ఏ మాయ చేసావే 2’ నిజంగా ఉంటుందా? చైతు, రష్మికల జోడి ఆ సీక్వెల్ లో నటిస్తారా?వంటి విషయాలపై త్వరలో క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు