Unstoppable With NBK : ఇప్పుడు బాల్య మిత్రులు

నటసింహ నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె. ఆహా లో ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ షో తో అభిమానులు బాలయ్యలో సరికొత్త కోణాన్ని చూశారు. అయితే ఇప్పుడు తాజాగా అన్ స్టాపబుల్ -2 సీజన్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్ తో మొదటి ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అయింది.

బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ తో బాలయ్య ముచ్చట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఆహాకు కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఇక తర్వాత సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ ఓ ఎపిసోడ్ లో సందడి చేయగా.. మరొక ఎపిసోడ్ లో శర్వానంద్, అడివి శేష్ హాజరయ్యారు. అయితే ప్రస్తుతం నాలుగో ఎపిసోడ్ లో ఎవరు రానున్నారు అని అందరిలో ఆసక్తి నెలకొంది. కొన్ని రోజుల నుంచి పలు రూమర్స్ కూడా వచ్చాయి.

తాజాగా ఈ వారం రాబోయే అతిధులు ఎవరో “ఆహా” ప్రకటించింది. ఎపిసోడ్ 4 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అతిధులుగా విచ్చేయనున్నారు. ఈ ఎపిసోడ్ ఈనెల 18వ తేదీ నుండి ఆహా లో అందుబాటులోకి రానుంది. ఇక బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఈ ఎపిసోడ్ లో పొలిటికల్ టచ్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు