Tollywood : ఓటీటీలోకి హిట్ మూవీస్

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు ఓటీటీ ఒక పెద్ద వరంగా మారింది. షూటింగులు పూర్తీ చేసుకున్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అలా ఓటీటీకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు, రియాలిటీ షో లు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ప్రేక్షకులు సినిమాల కోసం థియేటర్లకు వెళ్లడం మానేసి, ఓటీటీలోకి వస్తుంది కదా.. అప్పుడే చూద్ధాం లే అని అనుకుంటున్నారు. ప్రపంచానే అల్ల కళ్ళోలం చేసిన కరోనా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కి మాత్రం మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తుంది. ఎంత తొందరగా షూటింగ్ లు పూర్తీ చేసుకుంటునాయో అంతే తొందరగా థియేటర్ లో రిలీజై, ఓటీటీలోకి కూడా త్వరగానే వచేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షశివో, సంతోష్ శోభన్ నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రయిబ్ తో పాటు సమంత యశోద థియేటర్స్ లో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్నాయి.

ఈ సినిమాలో ఓటీటీల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాయని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఈ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ వచ్చాయి. ‘ఊర్వశివో రాక్షశివో’ డిసెంబర్ 9న ఆహా లో రాబోతుంది. ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రయిబ్’ సోని లివ్ లో డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే నవంబర్ ప్రారంభంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన యశోద కూడా డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుందని సమాచారం.

- Advertisement -

అలాగే నితిన్ – కృతి శెట్టి హీరో హీరోయిన్ల్ గా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా డిసెంబర్ 9న జీ5 లోకి రానుంది. నవంబర్ లో మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కుమ్మరించిన ఈ సినిమాలు ఓటీటీలో కూడా రికార్డులు నమోదు చేసే అవకాశం లేకపోలేదు.

Previous article
Next article

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు