OTT : మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా…

సినిమా పరిశ్రమలో డైరెక్ట్ OTT రిలీజ్ ఒక కొత్త ట్రెండ్ సెట్ అవుతోంది. కరోనాకి ముందు థియేటర్ లో రిలీజ్ చేయడానికి డేట్స్ కోసం తెగ ఆరాట పడిపోయేవారు. ఇప్పుడు మాత్రం ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటి…అనే ఫీలింగ్ తో ఉన్నారు. కానీ పండుగ రోజులలో మాత్రం డేట్ క్లాష్ ఉండడం సహజమే. అలాగే ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకి తప్ప మారేవరి సినిమాలకి ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లే వారు కాదు.

కానీ ఇప్పుడు హీరోల స్థాయితో సంబంధం లేకుండా, కంటెంట్ బాగుంటేనే థియేటర్ లి వెళ్లి చుస్తునారు. కంటెంట్ బాగా లేకపోతే మెగా స్టార్ చిరంజీవి సినిమాని కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టార్ అయిన విషయం తెలిసిందే. అదే కంటెంట్ బాగుంటే ఇతర భాషా సినిమాలని కూడా ఆదరిస్తున్నారు.

అలా OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో, నిర్మాతలు థియేటర్‌లలో విడుదల కన్నా OTT పై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ తో సినిమాలని తెరకెక్కించి డైరెక్ట్ OTTలో రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య కలంలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు డైరెక్ట్ OTTలో రిలీజ్ అయ్యాయి. మరో సినిమా నిర్మాతలు ఇదే దారిలో వెళ్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

శ్రద్ధా శ్రీనాథ్ మరియు రోహిణి ముఖ్య పాత్రలలో నటంచిన ‘విట్ నెస్’ (WITNESS) అనే పొలిటికల్ డ్రామా డిసెంబర్ 9 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమ్ అవనున్నట్టు అధికారక ప్రకటన వచ్చింది. తమిళం తోపాటు తెలుగు కన్నడ, మలయాళ భాషలో రిలీజ్ కానుంది. ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా మూవీ ఎలా ఉందో చూడాలి అంటే డిసెంబర్ 9 వరకి వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు