Balakrishna : అక్కినేని వారసుల స్ట్రాంగ్ కౌంటర్

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ”వీర సింహ రెడ్డి” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అలాగే బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా కలెక్షన్లను సంపాదిస్తోంది. కాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో బాలయ్య ప్రసంగిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ నటులు ఎస్.వి రంగ రావు, అక్కినేని నాగేశ్వర్ రావు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే ముఖ్యలు ఎస్.వి.రంగ రావు, అక్కినేని నాగేశ్వర్ రావు గురించి నందమూని నటసింహాం బాలయ్య అలాంటి వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్ లో చర్చనీయాశంగా మారింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు చాలా ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో ఈ నందమూని సీనియర్ హీరోకి కౌంటర్లు వేశాడు.

తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నట వారసులు నాగ చైతన్య, అఖిల్ ఘాటుగా స్పందించారు. తమ సోషల్ మీడియా ద్వారా, బాలయ్య పేరు వాడకుండానే ఓ స్ట్రాంగ్ కౌంటర్ ను వేశారు. “నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, ఎస్ వీ రంగా రావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం ” అంటూ నాగ చైతన్య, అఖిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

 

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు