Yatra 2: ‘యాత్ర 2’ లో ‘బాబాయ్’ క్యారెక్టర్ అతనే నా..?

డైరెక్టర్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ అధికారంలోకి రావటానికి ముఖ్య కారణమైన పాదయాత్ర ప్రధాన కధాంశంగా సాగిన ఆ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టీ నటించగా, రావు రమేష్, అనసూయ, జగపతి బాబు, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 2019లో విడుదలైన ఈ సినిమా అప్పటి ఎన్నికల్లో ప్రభావం చూపిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకంటే, ప్రస్తుతం యాత్రకి సీక్వెల్ గా యాత్ర 2 రాబోతోంది అన్న చర్చ జరుగుతోంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట.
2024ఎన్నికలను టార్గెట్ చేసుకొని రాబోతున్న ఈ సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా కనిపించనున్నాడని సమాచారం అందుతోంది. ఇప్పటికే డైరెక్టర్ మహి ఈ సినిమా కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉండగా, మరో ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, 2019 ఎన్నికలకు ముందు సంచలనాలకు దారి తీసిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన ఈ సినిమాలో ఉంటుందా ఉండదా?, ఉంటే ఆ క్యారెక్టర్లో ఎవరు నటించనున్నారు అన్న చర్చ నడుస్తోంది. రాజీవ్ కనకాల ఆ క్యారెక్టర్లో నటించబోతున్నారంటూ ఒక వర్గం ప్రచారం చేస్తోంది.
ఇటీవల కాలంలో రాజీవ్ కనకాల చేసిన సినిమాల్లో దాదాపు అన్ని క్యారెక్టర్లు సినిమా మధ్యలోనే చనిపోవటం కారణంగా జగన్ బాబాయ్ వైఎస్ వివేకా పాత్రలో రాజీవ్ సరిగ్గా సెట్ అవుతాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నాడు. జరుగుతున్న ప్రచారం మాట పక్కన పెడితే, మహి ఈ కథ కోసం ఏయే అంశాల్ని ఎంచుకుంటాడు, సినిమా  ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవనుంది వంటి అంశాలపై క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు