PS2: సైలెంట్ గా 300 కోట్లు దాటేసిన పాన్ ఇండియా మూవీ

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద తన పరుగును మెల్లిగా కొనసాగిస్తుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా పొన్నియిన్ సెల్వన్ కు కొనసాగుంపు గా వచ్చిన పార్ట్ 2 అవడం విశేషం. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ హీరో, హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన PS2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

అయితే మొదటి భాగం కంటే రెండో భాగం చాలా బాగుందని PS2 టాక్ తెచ్చుకున్నా కూడా, ఫస్ట్ పార్ట్ కి వచ్చినంత హైప్ గాని, ఓపెనింగ్స్ గాని రాలేవు. అయితే యావరేజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఉన్నంతలో బాగానే పరుగును కొనసాగిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేయగా మొదటి వారం నాలుగు రోజుల్లోనే 200 కోట్లు కొల్లగొట్టింది. రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్2 మూడు వందల కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది.

విడుదలైన 12 రోజుల్లో PS 2 వరల్డ్ వైడ్ గా అన్ని వెర్షన్లు కలిపి 300కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేయగా 145కోట్ల షేర్ ని వసూలు చేసింది. అయితే 172 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం క్లీన్ హిట్ కావాలంటే మరో 26 కోట్లు రాబట్టాలి. ఇతర భాషల్లో కలెక్షన్స్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ కాగా తమిళంలో మాత్రం అక్కడక్కడా ఆడుతుంది. మరి పొన్నియిన్ సెల్వన్2 బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ గీత దాటుతుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు