Fidha : సాయి పల్లవి ఆ తెలుగు హీరోని అంతగా ప్రేమించిందా..?

టాలీవుడ్ మోస్ట్ యాస్పైరింగ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మలయాళ ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో మొట్టమొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటనతో, డాన్స్ తో అందరినీ ఆకర్షించి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది సాయి పల్లవి. అంతేకాదు అప్పటివరకు కేవలం గ్లామరస్ పాత్రలకి మాత్రమే పరిమితమైన హీరోయిన్స్ ని కంటెంట్ పరంగా కూడా ముందుకు తీసుకువచ్చేందుకు బిగ్ స్టెప్ తీసుకుంది సాయి పల్లవి.

ఇక తన సినిమాల విషయంలో క్రేజీ కండిషన్స్ పెట్టే సాయి పల్లవి.. రొమాంటిక్ సీన్స్ లో నటించదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా తన నటనతోనే అందరినీ మెప్పిస్తూ సౌందర్య, సావిత్రి వంటి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ విషయాలు పక్కనపెడితే ఇప్పటికే మూడు పదుల వయసు దాటిన సాయి పల్లవి పెళ్లి ఉసే ఎత్తడం లేదు. ఇక ఇంట్లో వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవాలని సాయిపల్లవిని ఒత్తిడి చేస్తున్నరట. అయితే సాయి పల్లవిని ఓ తెలుగు హీరో ఫిదా చేసేశాడట. ఆయన ఎవరో కాదు శర్వానంద్. వీరిద్దరి కాంబోలో పడి పడి లేచే మనసు అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఇద్దరికీ మంచి మెమోరీస్ ని మిగిల్చింది.

సినిమా సమయంలోనే సాయి పల్లవి శర్వానంద్ ని ప్రేమించిందట. అంతేకాదు త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇదంతా కేవలం పుకార్లే అంటూ ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు సాయి పల్లవి అంటే ఇష్టం ఉన్న ఓ బడా ప్రొడ్యూసర్ కొడుకు ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టారట. కానీ ఇదే చిన్న రీజనల్ తో ఆమె పెళ్లిని సైతం క్యాన్సిల్ చేసుకుందట. చూడాలి మరి సాయి పల్లవి పెళ్ళి చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు