Chiranjeevi : ముహుర్తం ఖరారు

ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాలంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు ఇది తెలుగు రీమేక్ అన్న సంగతి అందిరికీ తెలిసిందే. లూసిఫర్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేశాడు మోహన్ రాజా.

ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేశారు. అలాగే టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార ముఖ్య పాత్రలు చేశారు. ఈ చిత్రం గత నెల 5వ తేదీన థియేటర్స్ లో విడుదలైంది. మంచి విజయం సాధించి చిరంజీవి కెరీర్ లో మరో హిట్ ను చేర్చింది. రూ. 80 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ. 170 కోట్ల వరకు వసూళ్లు చేసింది.

అయితే చాలా మంది గాడ్ ఫాదర్ థియేటర్ లో చూడలేకపోయారు. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. గాడ్ ఫాదర్ ఓటీటీ రిలీజ్ కు ముహుర్తం ఖరారు అయినట్టు సమాచారం. ఈ చిత్రం ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు నవంబర్ 19 నుంచి స్ట్రిమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు