Rishab Shetty : సీక్వెల్ ఉంటుందా ?

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, ముఖ్య పాత్రలో చేసిన చిత్రం కాంతారా. ఈ చిత్రం కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అలాగే ఇతర భాషల్లో విడుదల చేస్తే అక్కడ కూడా ఊహించని విధంగా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్లను కూడా భారీగానే వసూళ్లు చేస్తూ నిర్మాతల జేబులు నింపుతుంది. ఈ సినిమా ఇప్పటికే కన్నడలో రూ. 100 కోట్ల మార్కు ను అందుకుంది. కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక తెలుగులో గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి విధితమే. తెలుగులో కూడా కాంతారకు మంచి టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. తెలుగు వర్షన్ లో కాంతార ఇప్పటి వరకు రూ. 20 కోట్ల కు పైగా వసూళ్లు రాబట్టి, నిర్మాతకు భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత దీనికి రిషభ్ శెట్టి సీక్వెల్ చేస్తాడా అని ఇప్పుడు సినీ ప్రేమికుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

కాంతారలో కూడా సీక్వెల్ వస్తుంది అన్నట్లుగా చిన్నపాటి క్లూస్ కూడా ఉన్నాయి. దీంతో కాంతార పార్ట్ 2 తప్పకుండా వస్తుందని ప్రచారం సాగుతుంది. దీనిపై ఒక మీడియా సమావేశంలో హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టిని ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతానికి ఈ సినిమా సీక్వెల్ గురించి ఇంకా ఏమి ఆలోచించలేదు. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతనే సీక్వెల్ గురించి ఆలోచిస్తా అని చెప్పుకొచ్చారు. సీక్వెల్ పై రిషబ్ శెట్టి సమాధానం ఇచ్చినా.. ఈ వార్తలకు తెర పడలేదు. మరి కాంతారకు సీక్వెల్ ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు