రామాయణం ( Ramayan ).. ఈ ఇతిహాస గాధను తెరకెక్కించడానికి టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతో మంది దర్శకులు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఇప్పటికే ప్రయత్నించి విఫలం అయితే. మరి కొంత మంది సక్సెస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే గత ఏడాది బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ టాలీవుడ్ హీరో ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో కలిసి ఆది పురుష్ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి ముందడుగు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాత్రల కోసం స్టార్ కాస్టింగ్ ను ఎంచుకుంటున్నారు..
రామాయణంలో స్టార్ కాస్ట్..
ఇక అందులో భాగంగానే రాముడి కోసం రణబీర్ కపూర్ ని తీసుకోగా , సీత క్యారెక్టర్ కోసం సాయి పల్లవి ని ఎంచుకున్నారు కానీ సీత క్యారెక్టర్ నుండి సాయి పల్లవి తప్పుకోవడంతో ఆ పాత్రలో జాన్వీ కపూర్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. రావణుడిగా కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్ నటిస్తున్నారు అంటూ వార్తలు రాగా… ప్రస్తుతం ఆయన టాక్సిక్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్లో భాగంగానే హిందీ రామాయణ్ సినిమాకి నో చెప్పినట్లు సమాచారం. ఇక ఈ పాత్ర కోసం వేరొకరిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది..అలాగే రావణుడి చెల్లెలు సూర్పనక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు… ఇక అలాగే దశరథ పాత్రలో అరుణ్ గోవిల్ కనిపించనున్నట్లు సమాచారం.. ఇకపోతే రామాయణంలో అతి ముఖ్యమైన పాత్రల్లో లక్ష్మణుడి పాత్ర కూడా ఒకటి.. ఈ పాత్ర కోసం ఒక ప్రముఖ టీవీ నటుడిని తీసుకున్నట్లు తెలుస్తోంది..
లక్ష్మణ్ పాత్ర కోసం టీవీ యాక్టర్..
డైరెక్టర్ నితీష్ తివారి సినిమాపై అభిమానుల దృష్టి పడింది. రాముడు , సీత పాత్రల తర్వాత లక్ష్మణుడి పాత్ర పై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక లక్ష్మణ పాత్రకు ప్రముఖ టీవీ నటుడు, నిర్మాతను ఎంపిక చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ టీవీ నటుడిగా , నిర్మాత, హోస్ట్ అయిన ప్రముఖ పంజాబీ సినీ టీవీ నటుడు, ప్రముఖ నటి సర్గున్ మెహతా భర్త రవి దూబే రామాయణంలో లక్ష్మణుడి పాత్ర పోషించబోతున్నారు . అయితే ఈ విషయంపై అటు చిత్ర బృందం కానీ ఇటు రవి దూబే కానీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు..
రవి దూబే కెరియర్..
టీవీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి దూబే తన నటనా ప్రతిభతో పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు . 12/24 కరోల్ బాగ్, సాస్ బినా ససురల్, పర్వారీష్ వంటి అనేక ప్రసిద్ధ షోలలో పాత్రలు పోషించారు. వీటిని ప్రజలు ఇప్పటికీ గుర్తించుకున్నారడంలో సందేహం లేదు. ఇకపోతే రవి కెరియర్ కి కొత్త దిశా నిర్దేశం చేసిన ప్రముఖ టీవీ షో జమై రాజా.. ఇక నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. జునియాత్, స్వరణ్ ఘన్ ఉదరియన్ వంటి ప్రసిద్ధ టీవీ షోలను కూడా నిర్మించారు.