Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన జనసేన పార్టీనీ ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలని అటు టిడిపి ఇటు బిజెపితో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కి ఓటు వేయండి అంటూ ట్వీట్ చేస్తుంటే.. మరి కొంతమంది నేరుగా పిఠాపురం వెళ్లి ఈయన తరపున ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ కు మరో బ్యూటీ మద్దతుగా నిలిచింది.. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో ఓవర్ నైట్ లోనే మరింత పేరు సొంతం చేసుకున్న శ్రియా రెడ్డి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ .. పోస్ట్ పెట్టగా అది ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా శ్రియా రెడ్డి..
ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయని సాహసం ఈ ముద్దుగుమ్మ చేసింది. ధైర్యంగా ముందుకు వచ్చింది.. పవన్ కళ్యాణ్ కి విజయం దక్కాలని.. పైగా గాజు గ్లాసుకి ఓటు వేయండి అంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే ఇలా సెలబ్రిటీలు ఒకరి తర్వాత మరొకరు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న వారు కూడా పవన్ కళ్యాణ్ కోసం బరిలోకి దిగుతూ ఉండడం గమనార్హం..
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ..
ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.. బహిరంగంగా సభలకు వచ్చి స్పీచ్ లు ఇవ్వకపోయినా వీడియోని రిలీజ్ చేసి తన తమ్ముడిని సపోర్ట్ చేయండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.. ఇక ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్ , వైష్ణవ్ తేజ్ వంటి వారు ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరొకవైపు రామ్ చరణ్ , అల్లు అర్జున్, నిహారిక సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు.. జబర్దస్త్ కమెడియన్స్ కూడా రంగంలోకి దిగి ప్రచారం మొదలుపెట్టారు.. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ లు, పోస్టులు చేయడం గమనార్హం.
శ్రియా రెడ్డి..
దక్షిణ భారతదేశ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించింది. యాంకర్ గా బిజీ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఎవరో కాదు మాజీ క్రికెట్ క్రీడాకారుడు భరత్ రెడ్డి కూతురు.. సినిమాల్లో నటి కాకముందు ఎస్.ఎస్.మ్యూజిక్ అనే ఛానల్ లో వీడియో జాకీ గా పనిచేసింది. 2002లో సమురాయ్ అనే తమిళ చిత్రం ద్వారా అరంగేట్రం చేసిన ఈమె తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో కలుపుకొని డజనుకు పైగా సినిమాలలో నటించింది.. 2003లో అప్పుడప్పుడు , 2006లో అమ్మ చెప్పింది వంటి తెలుగు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Wishing you great luck #Pawanakalyan garu for a successful election in pithapuram ! May you be blessed with abundance always . #VoteForGlass pic.twitter.com/5scPQrThuT
— Sriya Reddy (@sriyareddy) May 10, 2024