Lok Sabha elections 2024.. తాజాగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కూడా ఈరోజు ప్రారంభం అయ్యింది. ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలామంది ప్రముఖులు ప్రజలతో పాటే సమన్వయం పాటిస్తూ క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా 25 ఎంపీ 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటల నుండే ఇక్కడ సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. మరి ఎవరెవరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో ఇప్పుడు చూద్దాం..
జూనియర్ ఎన్టీఆర్..
టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్.. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని లతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తాజాగా జూబ్లీహిల్స్ లోని బిఎస్ఎన్ఎల్ సెంటర్లో.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురు సుప్రీతాతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఈయన తాజాగా తన ఓటు హక్కును తన భార్య అన్నా లెజినోవా తో కలిసి వినియోగించుకున్నారు.
రాజమౌళి..
దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన భార్య రమా, కొడుకు కాలభైరవ తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు..
నాగచైతన్య..
నాగచైతన్య వుమన్ కోపేరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నందమూరి బాలకృష్ణ:
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈయన కూడా తన భార్య వసుంధర దేవితో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీరితోపాటు డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో సందీప్ కిషన్, ఎమ్.ఎమ్.కీరవాణి, తనికెళ్ల భరణి, హీరో శ్రీకాంత్, హీరో రాజశేఖర్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల , రామ్ పోతినేని, నితిన్ బుల్లితెర నటి హిమజ తదితర సెలబ్రిటీలు ప్రజలతో పాటు క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇకపోతే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. తమ పనుల నిమిత్తం ఎక్కడికెక్కడికో వెళ్లిన సెలబ్రిటీలు కూడా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హైదరాబాద్ కి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.. ఇక వీరితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు ప్రస్తుతం ప్రజలతో పాటు తమ పోలింగ్ స్టేషన్ ల వద్ద బారులు తీరారు.. మరి మిగిలిన వారు సాయంత్రం లోపు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారేమో చూడాలి.