Aadu Jeevitham : “ది గోట్ లైఫ్” కొత్త స్ట్రీమింగ్ డేట్.. ఇప్పుడైనా టైం కి వస్తుందా?

Aadu Jeevitham : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆడుజీవితం – ది గోట్ లైఫ్’. ఈ సినిమా గత మార్చి 28న విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తో పాటు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేదు. ఒక సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలోకి మార్చి 28న రాగా ,మలయాళీ ప్రేక్షకులు యానానిమస్ గా హిట్ చేసేసారు. కానీ తమిళ, తెలుగు భాషల్లో ఆడలేదు. సినిమా బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఉండడమే కారణం అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘ఆడుజీవితం – ది గోట్ లైఫ్’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍ స్టార్ మే 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు ఆడు జీవితం మూవీ కొత్త స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఆ రోజు నుండే ఆడు జీవితం స్ట్రీమింగ్!

అయితే తాజాగా ఆడు జీవితం ఓటిటి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆడు జీవితం సినిమా హాట్ స్టార్ లో ఈ నెల మే 26వ తేదీ నుంచి మూవీ స్ట్రీమింగ్‍ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్‍ కానుంది. అయితే ఈ విషయంపై హాట్‍ స్టార్ ఓటీటీ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మొత్తానికి ఆడు జీవితం మూవీ స్ట్రీమింగ్ ఆలస్యం అయితే అవుతుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో 160 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఆడుజీవితం మూవీ ఓటీటీలోకి ఎక్కువ రన్‍ టైమ్‍ తో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

Aadu Jeevitham "The Goat Life" movie streaming on Hotstar from 26th May

- Advertisement -

హాట్ స్టార్ లో మరింత నిడివితో?

ఇక ఆడు జీవితం (Aadu Jeevitham) సినిమా హాట్ స్టార్ లో ఎక్కువ నిడివితో టెలికాస్ట్ కానుందని సమాచారం. థియేటర్లలో ఈ మూవీ రన్‍ టైమ్ సుమారు 3 గంటలు ఉండగా, అదనపు సీన్లు యాడ్ చేసి మరో అరగంట ఎక్కువ నిడివితో ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే దర్శకుడు బ్లెస్సీ ఓ సందర్భంలో హింట్ ఇచ్చారు. బెన్యామిన్ రచించిన ఆడు జీవితం పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్‍ కు జోడీగా హీరోయిన్ అమలా పాల్ నటించారు. కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్, శోభనా మోహన్, తలీబ్ అల్ బలూషీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు