HBD Manushi Chillar.. మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని చెప్పాలి.. అయితే మెగా వారసుడు ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్టు లతో దూసుకుపోతున్న ఈమె ఈరోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న నేపథ్యంలో ఈమెకు సంబంధించిన పాత ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఇక అందులో భాగంగానే తనకు ఒక హీరో అంటే చాలా ఇష్టమని.. తనతో నటించడం కోసం తాను ఎదురుచూస్తున్నానంటూ వెల్లడించింది..
స్టార్ హీరో పై మనసు పారేసుకున్న మానుషీ చిల్లర్..
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె తనకు సౌత్ స్టార్ హీరో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని.. ఆయన డాన్స్ అద్భుతంగా ఉంటుందని… ఎప్పటినుంచో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది.. ముఖ్యంగా తాను ఇకపై తెలుగులో నటిస్తే అది కేవలం రామ్ చరణ్ తో మాత్రమే నటిస్తానని కూడా స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ.
బడే మియా చోటే మియా మూవీపై కామెంట్స్..
ఇకపోతే బడే మియా చోటే మియా సినిమాలో నటించింది.. ఈ సినిమాలో నటించినప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా తనకంటే వయసులో 30 సంవత్సరాలు పెద్దవాడైన అక్షయ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మానుషీ చిల్లర్ స్పందించింది.. ఈ విషయంపై ప్రతి ఒక్కరికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.. ముఖ్యంగా వయసులో మనకంటే పెద్దవారితో నటించడానికి నేనెంతగానో ఎంజాయ్ చేస్తాను.. ఆయనతో చాలామంది స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటారు.. అయితే కొంతమందికే మాత్రమే అవకాశం లభిస్తుంది.. తమ చిత్రాల్లోకి నటీనటులుగా ఎవరిని తీసుకోవాలని పూర్తిగా దర్శకుల పైన ఆధారపడి ఉంటుంది.. కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడుకోవాలనుకోవడం లేదు.. అవకాశం వస్తే అగ్ర హీరోల సినిమాలు లోనే కాదు యువ హీరోల సినిమాలలో కూడా నటించాలని అనుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది..
మానుషీ చిల్లర్ కెరియర్…
మానుషీ చిల్లర్ కెరియర్ విషయానికొస్తే.. 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఈమె అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సామ్రాట్ పృధ్విరాజ్ సినిమాతో బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, ఆపరేషన్ వాలెంటైన్ వంటి చిత్రాలలో నటించింది.. అలాగే సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన కబీర్ సింగ్ లో కూడా హీరోయిన్గా మొదట ఈమెకే అవకాశం వచ్చినా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీలో పలు చిత్రాలలో నటిస్తున్న ఈమె త్వరలోనే రామ్ చరణ్ తో అవకాశం వస్తే టాలీవుడ్లో నటిస్తానని చెప్పుకొచ్చింది. మరి దర్శక నిర్మాతలు ఈమెకు తెలుగులో అవకాశం ఇస్తారో లేదో చూడాలి.