Puri Jagannath: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అసలు ఈ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ మరో సినిమా చేస్తాడా అనే అనుమానాలు కూడా కొందరికి వచ్చాయి. అయితే బ్లాక్ బస్టర్ అయినా ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇష్మార్ట్ ని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు పూరి జగన్నాథ్.
ఇక ఈ సినిమాతో సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ చిత్రీకరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. డబల్ ఇస్మార్ట్ చిత్రానికి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణం వహిస్తున్నారు. లైగర్ సినిమా వాళ్ళ పూరి జగన్నాథ్ భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఏక ఈ మూవీ తో వందల కోట్లు నష్టపోయిన పూరి జగన్నాథ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకే డబల్ ఇష్మార్ట్ ను ముందుకు తీసుకువచ్చి ఆ డిజాస్టర్ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టైగర్ సినిమాతో పెద్ద నష్టాన్ని చవిచూసిన పూరీ జగన్నాథ్ డబల్ ఇస్మార్ట్ సినిమాకి ఖర్చులు తగ్గించుకుందామని ఆలోచిస్తున్నాడట. దీంతో ఈ మూవీ మళ్లీ మొదలు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావలసి ఉంది. అయితే పూరి జగన్నాథ్ అధిక ఆర్థికతి బాగోక పోవడంతో ఈ సినిమా కూడా లేట్ అవుతూ వస్తుంది.