Keerthi Suresh: అందాల తార కీర్తి సురేష్ మనందరికీ సుపరిచితమే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ చిన్నది అనంతరం మహానటివంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. నాని, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది.
ఇక మహానటి సినిమాతో ఈమె నటనను నిరూపించుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకు గాను కీర్తి ఉత్తమ నటి అవార్డు కూడా దక్కించుకుంది. చాలామంది సావిత్రి నే భూమి పైకి వచ్చిందా అంటూ కీర్తిని తెగ పొగిడేసారు. అయితే ఈ నటి ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో నటించిన మైదాన్ సినిమా హిట్ కావడంతో ఈ చిన్నది మరో ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో ఒక సినిమాకి కమిట్ అయింది ఈ బ్యూటీ.
ఈ క్రమంలోనే ఈ నటికీ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ హీరో కోసం కీర్తి మొదటిసారి తన పేరెంట్స్ కు ఇష్టంలేని పని చేస్తుందట. అక్షయ్ కుమార్ మూవీ రెగ్యులర్ షెడ్యూల్స్ కోసం కీర్తి సురేష్ చెన్నై నుంచి ముంబైకి వెళ్లలేక పోతుందట. ఈ క్రమంగానే ముంబైలోనే ఒక ఇల్లు తీసుకుని అక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తుందట. అయితే తల్లిదండ్రులకు మాత్రం ఆమె ముంబైలో ఉండడం అసలు ఇష్టం లేదు. కానీ అక్షయ్ కుమార్ తో సినిమాను వదులుకోవడం కీర్తికి ఇష్టం లేక తన తల్లిదండ్రులను నొప్పించి ఈ పని చేస్తుంది.