Super Jodi: ఇంతకాలం ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాల్టీ షో సూపర్ జోడి ఎట్టకేలకు ముగిసింది. కాగా జీ తెలుగు సూపర్ జోడి ఫినాలేకు ప్రముఖ యాంకర్ ఉదయభాను హోస్ట్గా వ్యవహరించింది. ఈ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా జరిగింది.
జడ్జ్ లుగా సీనియర్ హీరోయిన్ మీనా, ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి ఉన్నారు. ఇక ఈ ఫినాలేకు అతిథిగా హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ హాజరయ్యారు. 8 సెలెబ్రెటీ జంటలు ఈ సీజన్ మొత్తం అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కానీ చివరగా శ్రీ సత్య – సాకేత్ విన్నర్ గా నిలిచారు. ఈ సూపర్ జోడి ఈ ట్రోఫీ ని అందుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ సత్య మాట్లాడుతూ..” సూపర్ జోడి టైటిల్ గెలవడం ఒక కల లాంటిది. నేను ప్రొఫెషనల్ డాన్సర్ని కాకపోవడంతో సాంకేత్ ఎనర్జీకి సరిపోయేందుకు నిత్యం కష్టపడుతూనే వచ్చాను. టైటి ల్ ను సొంతం చేసుకునేందుకు అందరూ ఎంతో కష్టపడ్డారు. గట్టి పోటీ కూడా ఇచ్చారు. ఈ ప్రయాణం నా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంచింది ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీ సత్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.