Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ దాదాపు మూడు నెలలకు పైగా రాజకీయాల కోసం సినిమాలను దూరం పెట్టిన సంగతి తెలిసిందే. సెట్స్ పై ఉన్న సినిమాల్ని పూర్తిగా పక్కన రాజకీయాల్లో బిజీ అయ్యాడు. మొన్నటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హిందూపురం ఎన్నికల ప్రచార పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. దాదాపు ఆరు నెలలుగా బాలయ్య జనాల మధ్యనే తిరిగారు. తనదైన శైలి పొలిటికల్ స్పీచ్ లతో బాలయ్య దంచి కొట్టారు. ఈ ఆరు నెలలు నందమూరి రాజకీయ అభిమానులకు పండగలాగే అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజక వర్గాలు బాలయ్య పర్యటించడంతో ఆయా చోట్ల ఘన స్వాగతం లభించింది. రాజకీయ నాయకుడిగా కంటే సినీ గ్లామర్ ప్రభావం ఎలా ఉంటుందో? మరోసారి చూపించారు. ఇక ఇప్పుడు బాలయ్య పూర్తిగా ఫ్రీ అయ్యారు. సినిమాలకు టైం కేటాయిస్తూ, మళ్లీ ప్రెష్ మైండ్ తో షూటింగ్ లో పాల్గొనాలి. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తున్నా? అంత వరకు రెస్ట్ తీసుకోకుండా, బాలయ్య వాటితో పనిలేకుండా షూట్ కి హాజరవుతున్నట్లు సమాచారం.
అప్పుడే సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు..
ఇక ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ సినిమాని బాబి కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ .. ‘వీరసింహా రెడ్డి’ ..’భగవంత్ కేసరి’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు బాలయ్య. ఇక ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. 109 తో కూడా సాలిడ్ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు. పైగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మళ్లీ టిడిపి పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న ఉత్సాహం బాలయ్యలో కనిపిస్తుంది. ఈ ఉత్సాహానికి హిట్ కూడా తోడైతే అది వేరే లెవల్ లో ఉంటుంది. ఇక వచ్చే వారంలోగానీ .. ఆ పై వారంలోగాని కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందిట. దాంతో పాటు బాలయ్య మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడట.
రియల్ వార్ ముగించి రీల్ వార్ స్టార్ట్..
ఇక నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ వారం లోనే బాబీ సినిమా సెట్స్ పైకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. ఇక వచ్చి రావడంతోనే ఒక యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలు కానుందని సమాచారం. అంటే బాలయ్య రియల్ వార్ ముగించి..రీల్ వార్ కి రెడీ అవుతున్నట్లు లెక్క. ఇందులో బాలయ్యపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఓ భారీ సెట్ లో షూట్ చేయనున్నారట. ఇంత రిస్కీ ఫైట్ ను బాలయ్య ఇంతవరకూ చేయలేదని సమాచారం. అభిమానుల్లో పూనకం తెప్పించేలాగే ఈ ఫైట్ డిజైన్ చేసినట్లు చిత్ర యూనిట్ సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడుగా బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంటే బాలయ్య తో చేయబోయే యాక్షన్ సీక్వెన్స్ లో బాబీ డియోల్ తోనే ఉండొచ్చు. ఇందులో బాలయ్యకి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య సినిమాల్లో ఉండే కామన్ గా ఉండే ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఈ సినిమాలో కూడా ఉంటుందని సమాచారం.