Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత అటు ప్రజలకు ఇటు అభిమానులకు దిమ్మతిరిగే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. తాజాగా ఆయన వారణాసిలో సతీసమేతంగా పూజలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే మొన్నటికి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ హడావిడి.. నిన్నటికి నిన్న పోలింగ్ రిపోర్ట్ లతో బిజీ బిజీ.. కానీ నేటి నుంచి మాత్రం పవన్ సినిమాల్లో నటించడానికి సిద్ధం కానున్నారు. ఈ నేపథ్యంలోనే కాస్త సమయం తీసుకుని సతీసమేతంగా వారణాసి వెళ్లారు పవన్ కళ్యాణ్. వెల్లడమే కాదు అక్కడ దేవాది దేవున్ని చాలా నిష్టగా ప్రార్థించారు. వేద పండితుల సమక్షంలో లింగార్చన చేయడం మనం కల్లారా చూడవచ్చు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలతో సహా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
పవన్ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే గుడ్ న్యూస్..
జనసేనానిగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పాత్రకి కాస్త బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాను మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన సినిమాలను ఫినిష్ చేయబోతున్నారట.. ముఖ్యంగా జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి విడతల వారీగా సినిమా షూటింగ్లలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అంతేకాదు జూన్ 4 లోపే తన ఫ్యామిలీతో కలిసి చిన్న వెకేషన్ కూడా ప్లాన్ చేశారట పవన్ కళ్యాణ్.. ఇక అన్నింటినీ పూర్తి చేసుకుని కాస్త విరామం తర్వాత మళ్లీ సినిమా షూటింగ్లలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ప్రత్యేక పూజలు ఎందుకు..
ఇకపోతే ఆయన సినిమా షూటింగ్ లలో పాల్గొనబోయే విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు వారణాసిలో సతీ సమేతంగా ఎందుకు పూజలు నిర్వహించారు అనే విషయం అందరిలో కొత్త అనుమానాలను కలిగిస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని స్థాపించిన ఈయన.. అటు టిడిపి ఇటు బిజెపితో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగానే తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి వంగ గీత పై ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక రసవత్తరంగా ప్రచారాలే కాదు ఎన్నికల హడావిడి కూడా ముగిసింది. అయితే ఎలాగైనా సరే ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని వారణాసిలో సతీ సమేతంగా లింగార్చన చేయించినట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా ఆయన పూజలు నిర్వహించారు.. మరి ఆ దేవాది దేవుడు పవన్ కళ్యాణ్ ను కరుణిస్తారో లేదో తెలియాలి అంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే..
పవన్ కళ్యాణ్ సినిమాలు..
జూన్ 4 తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొనబోయే సినిమా షూటింగ్ ల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, మరోవైపు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ తో పాటూ ఉస్తాద్ సినిమాలను కూడా లైన్ లో పెట్టారు.. వీటన్నింటిని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి ఏ మేరకు అటు రాజకీయంగా ఇటు సినీ కెరియర్ పరంగా సక్సెస్ అవుతారన్నది అభిమానులలో ప్రశ్నార్థకంగా మారింది.
Chief @PawanKalyan & Anna Lezhneva garu in Kasi viswanadh temple @ Varanasi! pic.twitter.com/xWa289qWNy
— Pawanism Network (@PawanismNetwork) May 14, 2024