Vaishnavi Chaitanya.. బేబీ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ప్రముఖ యూట్యూబర్ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. గతంలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటించిన ఈమె ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.ఇప్పుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సినిమా ‘లవ్ మీ : ఇఫ్ యూ డేర్ ‘ ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా అవకాశం ని దక్కించుకుంది.. నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా మే 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టగా.. హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా గురువారం నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది.. ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ నాయకులు జూన్ 4 వరకు.. మేము ఈ సినిమా రిజల్ట్ కోసం ఈనెల 25 వరకు వేచి చూడాలి అంటూ తెలిపారు.
ఈవెంట్ లో భాగంగా దెయ్యాన్ని ప్రేమించడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటూ మీడియా ప్రతినిధులు హీరోని అడగ్గా.. ఆయన మాట్లాడుతూ.. సినిమా ప్రారంభించిన సమయంలో మేము కూడా ఇలాంటి సందేహంలోనే ఉన్నాము… కానీ ఒక 15 రోజుల షూటింగ్ తర్వాత తప్పకుండా ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే నమ్మకం మాలో కలిగింది. ముఖ్యంగా ఇందులోని లవ్ స్టోరీకి అందరూ కనెక్ట్ అవుతారు.. హీరో ప్రేమించేది దెయ్యాన్ని అని ఆడియన్స్ కి తెలిసినా.. హీరో మాత్రం ఒక మనిషిగానే ట్రీట్ చేస్తూ ప్రేమిస్తాడు అంటూ ఆశిష్ రెడ్డి చెప్పుకొచ్చారు..
అయితే ఈ కథ ఆలోచన ఎలా పుట్టింది? అనే ప్రశ్నకు.. దీనికి డైరెక్టర్ మాట్లాడుతూ.. మనలో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ప్రేమించి ఉంటారు.. నిజమైన ప్రేమకు కులం, మతం లాంటి పట్టింపులు లేవు.. ప్రాణం కూడా అవసరం లేదని నాకు అనిపించింది.. అందుకే ఈ పాయింట్ తోనే కథ పుట్టింది.. అంటూ తెలిపారు.
ఇకపోతే బేబీ తర్వాత లవ్ యూ సినిమా చేస్తున్నారు? మీ కెరియర్ కు సక్సెస్ అవుతుందని భావిస్తున్నారా..? అని అడిగగా.. ఆమె సమాధానం చెబుతూ బేబీ సినిమాతో మంచి విజయం అందుకున్నాను.. లవ్ మీ దాన్ని మరిపించేలా ఉంటుంది.. బేబీ సినిమా నాకు తొలి మెట్టు అయితే లవ్ మీ రెండో మెట్టు అని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది..
అల్లు అర్జున్ , ప్రభాస్ తో మీకు అవకాశాలు వచ్చాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా..? అని మీడియా ప్రతినిధులు అడిగితే .. దానికి అలాగే అల్లు అర్జున్ సరసన నటించడానికి ప్రస్తుతం ఎటువంటి అవకాశం రాలేదు.. ఒకవేళ వస్తే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది..
స్పిరిట్ మూవీలో ప్రభాస్ కి సోదరిగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా? అని అడగ్గా.. అది కేవలం రూమర్ మాత్రమే అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.. మొత్తానికైతే తనకు ఎటువంటి అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.