Junior NTR: సోషల్ మీడియా వేదికగా ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును విపరీతంగా వాడేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన అనంతరం నుంచి రామ్ చరణ్ ని హైలైట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ని తక్కువగా చూస్తూ చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోలేదు.
అప్పటినుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం కారణంగా ఎన్టీఆర్ ని ట్రోలింగ్ చేస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో సైతం ట్రోలింగ్ కి గురయ్యాడు తారక్. సోషల్ మీడియాలో ఎన్టీఆర్, ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో రాబోయే సినిమాకి సంబంధించిన మూవీ టైటిల్ కి రిలేటెడ్ గా ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాబోతుంది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ రివీల్ చేయబోతున్నారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నిల్కి షాక్ ఇస్తూ మేకర్స్ డ్రాగన్ పేరుతో మరొక మూవీని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.