Naga Babu Twitter: మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ సోషల్ మీడియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. మొన్న అల్లు అర్జున్ ను ఉద్దేశించి పరోక్షంగా పోస్ట్ పెట్టిన నాగబాబు… ఆ తర్వాత x మంచి వైదొలిగిపోయాడు. అయితే ఇవాళ మళ్లీ సోషల్ మీడియాలోకి నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మెగా కుటుంబంలో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. అయితే ఈ విషయం మెగా కుటుంబంతో పాటు… తెలుగు ప్రేక్షకులకు కూడా మండేలా చేసింది. జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా…. వైసిపి పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం ఏంటని అందరూ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే… నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు ఎవరైనా పరాయి వాడే అంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. అయితే ఆ పోస్టు అల్లు అర్జున్ ను ఉద్దేశించి నాగబాబు చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత నాగబాబు ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ట్రొలింగ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో… నాగబాబు సోషల్ మీడియా అకౌంట్ దాదాపు 3 రోజులపాటు కనిపించకుండా పోయింది.
దీంతో తన అకౌంట్ డిలీట్ చేసుకున్నాడని నాగబాబుపై వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా నాగబాబు అందరికీ ట్వీస్ట్ ఇచ్చాడు. మళ్లీ ట్విట్టర్ (X)లోకి నాగబాబు వచ్చాడు. ఇటీవల అకౌంట్ను డిలీట్ చేసిన మెగా బ్రదర్.. నేను నా ట్వీట్ను డిలీట్ చేశానంటూ కొత్త పోస్ట్ పెట్టారు నాగబాబు. అయితే..నేను నా ట్వీట్ను డిలీట్ చేశానంటూ నాగబాబు చేసిన పోస్ట్ పై వైసీపీ, బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ భయానికి నాగబాబు భయపడిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ట్వీట్ డిలీట్ చేశాడని అంటున్నారు. అయితే.. నాగబాబు తాజాగా చేసిన అకౌంట్ ఆయనది కాదని…అది ఫేక్ అకౌంట్ అని కొంతమంది అంటున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.