Renudesai.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇకపోతే పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ల పేర్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతూ ఉంటాయి.. పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నప్పుడు కూడా ఆమె ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోలేదు.. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుందో అప్పటినుంచి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈమెను టార్గెట్ చేయడం ప్రారంభించారు.. అయితే మరికొంతమంది మాత్రం ఎప్పటికీ నువ్వు మా వదినవే అంటూ ఆమెను ప్రేమగా పలకరించే వారి సంఖ్య కూడా ఎక్కువే..
రేణు దేశాయ్ మాటలకు పవన్ ఫ్యాన్స్ ఫైర్..
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె చేసిన కామెంట్లు మళ్లీ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. పవన్ కళ్యాణ్ పేరును బ్రష్టు పట్టించేలా మాట్లాడింది.. రేణూ దేశాయ్ మాట్లాడుతూ నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం.. వారితోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాను.. నా కెరియర్ గురించి నేను ఎక్కువగా ఆలోచించను.. అంతేకాదు ప్రతి ఒక్క రిలేషన్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి.. ఒకరు హ్యాపీగా ఉంటే ఒకరు ఏడుస్తూనే ఉంటారు.. నేనేమీ స్పెషల్ కాదు కదా.. నా లైఫ్ కూడా అంతే .ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎవరు నన్ను ఏమీ అడగవద్దు నేను ఆయన గురించి ఏం మాట్లాడినా.. దాన్ని తప్పుగానే రాస్తున్నారు అంటూ కామెంట్లు చేసింది .. అంతేకాదు నేను ఒకటి చెప్తే దానిలో ఉన్న ఇంపార్టెంట్ విషయాన్ని వదిలేసి వేరే ఒక విషయాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
రేణు దేశాయ్ తొలి సినిమా జీవితం..
ఇక రేణు దేశాయ్ సినిమాల విషయానికొస్తే రెండు దశాబ్దాల క్రితమే విడుదలైన బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.. ఆ తర్వాత మూడేళ్లకు జానీ సినిమాతో మళ్ళీ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించింది .. అప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఇండస్ట్రీలో. జోరందుకున్నాయి. ఎట్టకేలకు 2009లో వీరిద్దరు ఘనంగా పెళ్లి చేసుకున్నారు.. దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మూడేళ్లు కూడా వైవాహిక జీవితంలో ప్రయాణం చేయలేక విడాకులు తీసుకున్నారు.. ఇక పవన్ మరొక పెళ్లి చేసుకోగా.. రేణు దేశాయ్ మాత్రం తన పిల్లల ఇద్దరినీ చూసుకుంటూ ముంబైలో సెటిలైపోయింది..
రీ ఎంట్రీ లో సక్సెస్..
ఇక ఇటీవలే దాదాపు 20 సంవత్సరాల తర్వాత రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ఈమె మొహానికి మేకప్ వేసుకుంది.. రేణూ దేశాయ్ ఈ సినిమాలో స్టువర్టుపురం ని అభివృద్ధి చేసి అక్కడి దొంగల్లో మార్పు రావాలని తపించే ఒక సామాజిక కార్యకర్త హేమలత లవణం పాత్రలో లీనమైపోయి మరీ నటించింది.
View this post on Instagram